దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు ..

272
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. వైరస్‌ కేసుల సంఖ్య 1,00,096కు చేరిందని, మరణాల సంఖ్య 3,078గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,242 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు రికార్డు కావడం ఇదే మొదటిసారి. 24 గంటల్లో 157 మంది మరణించారు.

మహారాష్ట్రలో ఇప్పటి వరకు 33 వేలకుపైగా కేసులు, 1,249 మరణాలు నమోదయ్యాయి. తమిళనాడులో11,760 కేసులు నమోదుకాగా 81 మరణాలు సంభవించాయి. గుజరాత్‌లో 11,746 కేసులు నమోదకాగా 694 మరణాలు సంభవించాయి.

- Advertisement -