సీఎం స‌హాయ‌నిధికి విరాళాల వెల్లువ‌..

242
ktr
- Advertisement -

క‌రోనాపై పోరాటానికి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సిఎంఆర్ఎఫ్ కు రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి పివి కృష్ణారెడ్డి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. ముఖ్యమంత్రి మెగా గ్రూప్ కు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ కు చెందిన మీనాక్షి గ్రూప్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందివ్వడానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును బుధవారం ప్రగతి భవన్ లో మంత్రి కెటి రామారావుకు సంస్థ చైర్మన్ కె.ఎస్.రావు, ఎండి. సి.శివాజి అందించారు.

తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు ఉపయోగపడే నాలుగు వేల ఎన్ 95 మాస్కులను GPK ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ యజమానులు ఫణి కుమార్ , కర్నాల శైలజా రెడ్డి గురువారం నాడు ఐటీ , మున్సిపల్ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రగతి భవన్ లో అందజేశారు .

రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ‘క్రెడాయ్’ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ప్రగతి భవన్ లో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావుకు సంస్థ ప్రతినిధులు అందించారు.

- Advertisement -