టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ను భారత ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకోకపోవడం వివాదాస్పదమైంది. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ పరాజయం అనంతరం భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ డూషాటే మాట్లాడుతూ, తుది జట్టును ఖరారు చేసే ముందు జట్టు నిర్వహణ విస్తృతంగా చర్చించిందని తెలిపారు. వైస్కెప్టెన్ అక్షర్ పటేల్ను తప్పించడం పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయం అని, జట్టు సమతుల్యత దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని చెప్పారు.
ఈ ఓటమితో ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్లలో భారత్కు 18 మ్యాచ్ల తర్వాత మొదటి పరాజయం ఎదురైంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఓడిన తర్వాత ఇది తొలి ఓటమి.
ఇది టి20 అంతర్జాతీయాల్లో పరుగుల తేడాతో భారత్కు రెండో అతిపెద్ద ఓటమి. 2019లో వెల్లింగ్టన్లో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగుల తేడాతో ఓడినది మొదటిది. టి20 వరల్డ్ కప్ చరిత్రలో మాత్రం ఇదే అతిపెద్ద ఓటమి.
Also Read:దేవుడికి మహాపచారం..అసెంబ్లీలోనే బయటపెడతాం!
మ్యాచ్ అనంతర మీడియా సమావేశంలో టెన్ డూషాటే మాట్లాడుతూ..గత రెండు రోజులుగా ప్లేయింగ్ 11 ఎంపికపై చాలా సమయం వెచ్చించాం. క్వింటన్ డి కాక్, రికెల్టన్లను త్వరగా అవుట్ చేయడంతో మంచి ఆరంభం దక్కింది. అయితే మధ్య ఓవర్ల మ్యాచ్ప్లను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. అతను వివరించినదేమంటే, ఎనిమిదో బ్యాటర్గా రింకూ సింగ్ అవసరమని భావించారని తెలిపారు. అదనపు బ్యాటర్ను తీసుకోవడం వల్ల వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ మధ్య ఒకరినే ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు. ఇది అక్షర్ ప్రాముఖ్యతను తగ్గించడం కాదు. ఆయన నాయకత్వం, జట్టుకు చేసిన సేవలు ఎంతో ముఖ్యమైనవి అని స్పష్టం చేశారు.

