- Advertisement -
రాజస్ధాన్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. 12 జిల్లాలోని 50 మున్సిపాలిటీ సంస్థల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. 1,775 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 620 వార్డులను కాంగ్రెస్ గెలుపొందగా బీజేపీ 548 స్ధానాల్లో విజయం సాధించగా స్వతంత్రులు 595 స్ధానాల్లో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో 79.90 శాతం పోలింగ్ నమోదుకాగా ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20న చైర్మన్ల, 21న వైస్ చైర్మన్ల ఎన్నికల ఉండనుంది.
- Advertisement -