మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా..

227
congress
- Advertisement -

2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటింది. మిజోరం,తెలంగాణలో తప్ప మూడు రాష్ట్రాల్లో హస్తం జెండా రెపరెపలాడింది. మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి షాకిస్తూ కాంగ్రెస్ విజయం సాధించింది.

మధ్యప్రదేశ్‌(230)లో 114 స్థానాల్లో కాంగ్రెస్‌, 101 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌(199)లో 102 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా.. భాజపా 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఛత్తీస్‌గఢ్(90)‌లో 58 స్థానాల్లో కాంగ్రెస్‌, 23 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉన్నాయి.

ఇక తెలంగాణ(119)లో టీఆర్ఎస్ 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌ 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మిజోరం(40)లోనూ కాంగ్రెస్‌ పార్టీ వెనుకంజలో ఉంది. ఇక్కడ ఎంఎన్‌ఎఫ్‌ 25 స్థానాల్లో ఆధిక్యం ఉండగా కాంగ్రెస్‌ 8 స్థానల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

- Advertisement -