కారు జోరు..2స్ధానాల్లో భారీ మోజారిటీ…

227
trs
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కారు జోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే మ్యాజిక్ ఫిగ‌ర్ ను క్రాస్ చేసి సెంచ‌రీకి చేరువ‌లో ఉంది. టీఆర్ఎస్ జైత్ర‌యాత్ర జ‌గిత్యాల నుంచి ప్రారంభ‌యింది. జ‌గిత్యాల టీఆర్ఎస్ అభ్య‌ర్ధి డాక్ట‌ర్ సంజ‌య్ 40వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక రెండో గెలుపు వ‌ర్ద‌న్న‌పేట్ ఆరూర్ ర‌మేష్ 30వేల ఓట్ల మెజార్టీతో గెలుపోందారు. తాజాగా స‌న‌త్ న‌గ‌ర్ మ‌హాకూట‌మి అభ్య‌ర్ధి కూన వెంక‌టేశ్ గౌడ్ పై టీర్ఎస్ అభ్య‌ర్ధి మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ 6,227ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప‌రకాల నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హాకూట‌మి అభ్య‌ర్ధి కొండా సురేఖ‌కు ప‌రాజ‌యం త‌ప్ప‌డం లేదు. మూడో రౌండ్ ముగిసేస‌రికి టీఆర్ఎస్ అభ్య‌ర్ధి చ‌ల్ల ధ‌ర్మారెడ్డి 12,457ఓట్ల లీడ్ లో ఉన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా కారు బుల్లెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది.

- Advertisement -