కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నేడే..

131
- Advertisement -

ఇవాళ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నేడు పోటీ జరగనుంది. బరిలో సీనియన్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ ఉండగా ఇద్దరి మధ్య హోరాహోరి పోరు జరగనుంది. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఆరోసారి పోలింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నిక జరగనుండగా 9,300 మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

సీనియర్ల మద్దతు ఖర్గేకు ఉండగా యువకులు శశిథరూర్‌కి మద్దతు చెప్పారు. ఇప్పటికే వీరిద్దరూ అన్ని రాష్ట్రాల్లోని పార్టీ కమిటీలతో భేటీ అయి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.

2000లో చివరిసారిగా సోనియా గాంధీ, జితేంద్ర ప్రసాద్ మధ్య ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుల్లో సోనియా 22సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పనిచేశారు. చివరిసారి గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేస్రీ.

- Advertisement -