దేశానికి పట్టిన కరోనా…కాంగ్రెస్సే: సీఎం కేసీఆర్

358
kcr
- Advertisement -

కరోనా రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని…ఎటువంటి విపత్కర పరిస్ధితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో కరోనాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం…కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.

కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రం చర్యలు తీసుకోవడం లేదన్న భట్టి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు సీఎం. కరోనా వంటి సున్నిత అంశాలను రాజకీయం చేసి ప్రజలను భయాందోళనకు గురి చేయొద్దు అన్నారు. ఈ దేశానికి పట్టిన భయంకరమైన కరోనా వైరస్‌ కాంగ్రెస్సే అని మండిపడ్డారు.

కరోనా కట్టడిపై కేబినెట్ సమావేశంలో చర్చించి…చర్యలను ప్రకటిస్తామని తెలిపారు. కరోనా నియంత్రణకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.

- Advertisement -