రామాలయ నిర్మాణం..కాంగ్రెస్ ఎమ్మెల్యే భారీ విరాళం

131
aditi singh
- Advertisement -

అయోధ్యలో రామాలయం ఏర్పాటులో భాగంగా రామతీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్నివర్గాల ప్రజలు విరాళాలు అందిస్తుండగా తాజాగా యూపీకి చెందిన రాయ్‌బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ విరాళాన్ని అందించారు.

రామాలయం నిర్మాణం కోసం రూ.51 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. తన టీమ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున ఈ విరాళం అందజేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందు పరిషత్, అయోధ్య రామాలయ ట్రస్ట్ లు విరాళాలను సేకరిస్తున్నాయి.

జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వ తేదీ వరకు ఈ విరాళాల సేకరణ ఉంటుంది. ఈ విరాళాల సేకరణను కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -