- Advertisement -
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య(85) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. నంది ఎల్లయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా,టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నంది ఎల్లయ్య పని చేశారు. సిద్దిపేట లోక్సభ స్థానం నుంచి ఐదుసార్లు పార్లమెంట్కు ఎన్నిక కాగా, నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు సార్లు రాజ్యసభకు ఎన్నిక కాగా, ఎమ్మెల్సీగా కూడా నంది ఎల్లయ్య పని చేశారు.
తెలంగాణ కాంగ్రెస్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.
- Advertisement -