కాంగ్రెస్‌ జనగర్జన..వీరికే ఛాన్స్

54
- Advertisement -

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఖమ్మంలో జరగబోయే కాంగ్రెస్ జనగర్జన సభలో ఆ పార్టీ కండువా కప్పుకొనున్న సంగతి తెలిసిందే. ఈ సభకు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ రానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సభకు ఖమ్మం ముస్తాబుకాగా దాదాపు 5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. దాదాపు 100 ఎకరాల్లో కాంగ్రెస్ సభకు ఏర్పాట్లుజరుగగా 55 అడుగుల ఎత్తు, 144 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు తో ఏకంగా 200 మంది కూర్చునేందుకు వీలుగా సభావేదికను ఏర్పాటు చేశారు.

ఇక ఈ సభలో రాహుల్ గాంధీతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే ప్రసంగిస్తారని తెలుస్తోంది.

Also Read:Jagadish Reddy:వైద్యరంగంలో పెనుమార్పులు

భట్టి విక్రమార్క పాదయాత్ర ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. హస్తం నేతలు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ సభతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

Also Read:Rakul:చీరకట్టులో అదరహో

- Advertisement -