టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్..

290
trs
- Advertisement -

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ లోకి వలసల పర్వం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ వార్డు కాంగ్రెస్ కార్పొరేటర్ చిరుగింత పారిజాత నరసింహారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం చిరుగింత పారిజాత నరసింహారెడ్డికి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా టీఆర్ఎస్ లో చేరారు.

- Advertisement -