పవన్ కళ్యాణ్ ను హీరో చేయకండిః కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

454
Sampath Kumar Pawan Kalyan
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేతలపై మండిపడ్డారు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి సభ్యుడు సంపత్ కుమార్. తెలంగాణలో యురేనియం తవ్వకాలపై పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాగా యురేనియం తవ్వకాలపై ఇటివలే పవన్ కళ్యాణ్ సమక్షంలో అఖిల పక్షం మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, వీ హెచ్ లు హాజరయ్యారు.

130ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంతో పవన్ కళ్యాణ్ ను హీరో చేయడం ఏంటని ఆయన నిలదీశారు. నిన్న గాంధీభవన్ లో జరిగిన పీసీసీ మీటింగ్ ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో పీసీసీ సమావేశంలో హాట్ హాట్ గా సాగింది.

సంపత్ చేసిన వ్యాఖ్యలపై ఖండించారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆర్ సీ కుంతియా. ఇకపై ఇటువంటివి పునరావృతం కానివ్వబోమని అన్నారు. యురేనియం తవ్వకాలపై ఇప్పటికే ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిసి, అభ్యంతరాలు వ్యక్తం చేశామని, సీఎంకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ లేఖ రాశారని అన్నారు.

- Advertisement -