ఈటెల కుమారుడిపై ఫిర్యాదు.. దర్యాప్తుకు సీఎం కేసీఆర్‌ ఆదేశం..

217
CM KCR
- Advertisement -

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావుకు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదుతో కూడిన దరఖాస్తు చేశారు.

తనకందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఎసిబి విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖ, రెండు శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

- Advertisement -