కామెడీ థ్రిల్లర్.. ‘జిగేల్’

3
- Advertisement -

త్రిగుణ, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జిగేల్. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్రిగుణ కీ సెట్ ని పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది.ఈ చిత్రంలో సాయాజీ షిండే, పోసాని, రఘు బాబు, పృథ్వి ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.ప్రముఖ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Also Read:న్యాయం గెలిచింది: మాజీ ఎంపీ సంతోష్ కుమార్

- Advertisement -