గవర్నర్‌కు సీఎం స్టాలిన్ ఘాటు లేఖ..

52
- Advertisement -

తమిళనాడు గవర్నర్-ప్రభుత్వం మధ్య వివాదం ముదిరిపాకాన పడుతోంది. గవర్నర్ ఆర్ ఎన్ రవికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఘాటు లేఖ రాశారు.నా మంత్రులను తొలగించే అధికారం మీకు లేదని నేను పునరుద్ఘాటిస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు.

న్నుకోబడిన ముఖ్యమంత్రికి ఉన్న ఏకైక అధికారం..నా సలహా లేకుండా నా మంత్రిని తొలగించిన మీ రాజ్యాంగ విరుద్ధమైన కమ్యూనికేషన్ చెల్లదని లేఖలో తేల్చిచెప్పారు.ఈ చర్య చట్టబద్ధం కానందున విస్మరించబడిందని లేఖలో తెలిపారు.

ఇక అలాగూ తమిళనాడులో డీఎంకే కుటుంబ రాజకీయాలను నడుపుతోందని ప్రధాని మోదీ చెప్పడం అక్షరాలా నిజమన్నారు. డీఎంకేలోని సభ్యులంతా ఒక కుటుంబంలా మెలుగుతూ రాజకీయాలు చేస్తున్నామనే విషయాన్ని అంగీకరిస్తున్నానని చెప్పారు. పార్టీలోని సభ్యులందరం కుటుంబ సభ్యుల్లా మెలుగుతామని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్ లో గత 50 రోజులుగా హింసాకాండ జరుగుతున్నా మోదీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు.

Also Read:వీటితో కొలెస్ట్రాల్‌ కు చెక్ పెట్టండి…

- Advertisement -