- Advertisement -
ఖేలో ఇండియా గేమ్స్, 40వ నేషనల్ గేమ్స్, ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయని కలిసి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో లాగే రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ భేటీలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read:GIC:హరితహారంలో బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణలో ఏర్పాటు చేయబోయే క్రీడా యూనివర్సిటీపై చర్చించనున్నారు. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై చర్చించారు. అలాగే తన పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు అమిత్షా, జేపీ నడ్డా, మనోహర్లాల్ ఖట్టర్తోనూ భేటీ కానున్నారు రేవంత్.
- Advertisement -

