ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి విషెస్..

234
cm kcr
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిల్లేలా దేవతలు దీవించాలి. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరియాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు సీఎం.

సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. సం క్రాంతి వచ్చిందంటే చాలు కొత్త కొత్త పతంగులు గాల్లోకి ఎగురుతాయి. కులమతాలకు సంబంధం లేకుండా అందరూ పతంగులను ఎగరేస్తూ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. అలాంటి పతంగులకు కేరాఫ్ హైదరాబాద్ ధూల్‌పేట . ఈ దూల్‌పేటలో దొరికే రకరకాల పతంగుల కోసం నగరంలోనే కాకుండా పక్కజిల్లాల యువత కూడా ధూల్‌ పేటకు వస్తుంటారు.

- Advertisement -