ఎంజీఎంలో కరోనా బాధితులను పరామర్శించిన సీఎం కేసీఆర్..

100
kcr
- Advertisement -

వరంగల్ ఎంజీఎంలో కరోనా బాధితులను పరామర్శించారు సీఎం కేసీఆర్. ఐసీయూలో కరోనా బాధితులను పరామర్శించిన సీఎం…వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ వార్డుల్లో క‌లియ‌తిరుగుతూ.. రోగుల‌తో మాట్లాడి,వారికి ధైర్యం చెప్పారు సీఎం కేసీఆర్.

ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -