ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తను పరామర్శించిన సీఎం కేసీఆర్..

159
kcr
- Advertisement -

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తాను పరామర్శించారు సీఎం కేసీఆర్. గణేశ్‌గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల మరణించగా మాక్లూర్‌ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఇంట్లో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కృష్ణ‌మూర్తి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి కేసీఆర్ నివాళుల‌ర్పించారు.

గణేష్ గుప్తాను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు సురేష్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్,ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు సురేందర్, హన్మంత్ షిండే, జీవన్ రెడ్డి పరామ‌ర్శించారు.

- Advertisement -