లష్కర్ బోనాలు.. సీఎం కేసీఆర్ కు విందు ఇచ్చిన డిప్యూటీ స్పీకర్

290
cm kcr
- Advertisement -

సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈసందర్భంగా ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

సీఎం కేసీఆర్ క్యూలో నిల్చున్న భక్తులకు అభివాదం చేశారు. అంతకుముందు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి మంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇక బోనాల పండుగ సందర్భంగా విందు వీఐపీలకు విందు ఏర్పాటు చేశారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. ఈ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, హోం మంత్రి మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి , ఎమ్మెల్యే దానం నాగెందర్ పలువురు పాల్గోన్నారు.

- Advertisement -