నేడు యాదాద్రి క్షేత్ర పర్యటనకు సీఎం కేసీఆర్..

142
- Advertisement -

సీఎం కేసీఆర్ మంగళవారం (నేడు) యాదాద్రిని సందర్శించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరి యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని మరోసారి సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. యాదాద్రి పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారు. యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను,తేదీలను కూడా ఇవ్వాళ సీఎం ప్రకటించనున్నారు. ఈ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఈమేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు.

- Advertisement -