- Advertisement -
ఈ నెల 19న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం (19 అక్టోబర్) ఆయన ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నింటినీ మరోసారి సీఎం పరిశీలిస్తారు. యాదాద్రి ఆలయం పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించి వున్నారు. యాదాద్రిలోనే ఆలయ పున:ప్రారంభం తేదీలను సీఎం స్వయంగా ప్రకటిస్తారు. పున:ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం ప్రకటించనున్నారు.
- Advertisement -