హరితహారం పండగకు అంతా సిద్ధం..

237
Haritha Haram
- Advertisement -

తెలంగాణలో హరితహారం పండగకు అంతా సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పురపాలికలోని ప్రజల భాగస్వామ్యంతో ఒకేసారి లక్ష మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణలో నాలుగో విడత హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఒకేరోజు రికార్డు స్థాయిలో 1,00,116 మొక్కలు నాటే కార్యక్రమం బుధవారం ఆయన చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

CM KCR

హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ములుగు సమీపంలోని రాజీవ్‌ రహదారిపై ఒకచోట, గజ్వేల్‌ పట్టణ పరిధిలో రెండు చోట్ల మొక్కలు నాటుతారు. గజ్వేల్‌ పరిధిలోని ప్రతి ఇంట్లో, అన్ని రహదారుల పక్కన, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం అన్ని పాఠశాలలు, ప్రార్ధనామందిరాల్లో హరితహారం సైరన్ మోగించగానే సీఎం కేసీఆర్ ఇందిరాచౌక్ వద్ద కందంబ మొక్కను నాటుతారు. అదేసమయంలో ప్రజలందరూ మొక్కలు నాటుతారు.

Haritha Haram

ఈ కార్యక్రమం కోసం వివిధ నర్సరీల నుంచి ఒకటిన్నర నుంచి రెండుమీటర్లు ఉన్న దాదాపు లక్షా 25వేల మొక్కలను సిద్ధంగా ఉంచారు. పండ్లు, పూల మొక్కలతోపాటు ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి వీలుగా చింత, మామిడి, అల్లనేరేడు, కరివేపాకు, మునగ మొక్కలను ప్రత్యేకంగా తెప్పించారు. ములుగు, గజ్వేల్ నర్సరీలతోపాటు కల్పకవనం అర్బన్‌పార్క్ నుంచి పట్టణంలోని వివిధ ప్రాంతాలకు వాటిని తరలించారు.

- Advertisement -