రైతు వేదిక ప్రారంభోత్సవానికి ఆహ్వానం- పల్లా

138
palla rajeshwar reddy
- Advertisement -

ఈ నెల 31న మధ్యాహ్నం 12:30 గంటలకు జనగామ జిల్లా, కొడకండ్ల మండల కేంద్రంలో రైతు వేదికను ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. అలాగు ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను ముఖ్యమంత్రి వివరిస్తారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంభందించిన తెలంగాణ రైతు బంధు సమితి జిల్లా, మండల మరియు గ్రామ కోఆర్డినేటర్లు మరియు సమస్త సభ్యులు తగు సమయానికి హాజరు అయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. తెలంగాణ రైతు బంధు సమితి జిల్లా, మండల, గ్రామ కోఆర్డినేటర్లు మరియు సమస్త సభ్యులు అందరికీ నమస్కారం అంటు ఆహ్వానించారు.

- Advertisement -