సాగర్ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్..!

168
kcr
- Advertisement -

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ పేరును ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయిన సీఎం…దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామని…సాగర్ ఎన్నికల ప్రచారానికి వస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా తేరా చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్‌, కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని ..ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో సాగర్‌లో కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ సాధించాలని నేతలకు సూచించారు.

రేపు ఉదయం భగత్‌‌ తన నామినేషన్‌ వేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని నిలబెట్టింది. బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.

- Advertisement -