6వ విడత హరితహారానికి శ్రీకారం..

296
kcr
- Advertisement -

తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమం హరితహారం ఆరోవిడతను ప్రారంభించారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ నిరాడంబరంగా 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లనేరేడు మొక్కను నాటారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

6వ విడత హరిత హారంలో భాగంగా రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను ఉచితంగా అందిచనున్నారు. గతంలో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా మొక్కలు నాటగా.. ఈసారి అడవుల్లో ఎక్కువ మొక్కలు నాటే ప్రణాళికలు రూపొందించారు.హరితహారం కోసం రాష్ట్రంలోని 12,500 నర్సరీల్లో మొక్కలు రెడీగా ఉన్నాయి.

గత ఐదేళ్లలో ప్రభుత్వం 177 కోట్ల మొక్కలను నాటారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడంతో పాటు తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడం కోసం కేసీఆర్ సర్కారు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

- Advertisement -