సిద్దిపేటపై సీఎం కేసీఆర్ వరాల జల్లు..

167
kcr
- Advertisement -

సిద్దిపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ ముగిసింది. ఈ సభలో సిద్దిపేటపై సీఎం వరాల జల్లు కురిపించారు. సిద్దిపేట జిల్లా కల నెరవేరిందని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలో నీటి గోస నివారణకు లోయర్ డ్యామ్ నుండి నీళ్లు తెచ్చుకున్నామన్నారు. సిద్దిపేట స్కీమే రాష్ట్రానికి విస్తరించిందన్నారు. దానిపేరే మిషన్ భగీరథ అని పేర్కొన్నారు.

ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే సిద్దిపేట-ఇల్లంతకుంట నాలుగు లైన్ల రోడ్డు మంజూరు చేస్తామన్నారు. రంగనాయకసాగర్ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్నారు సీఎం.సిద్దిపేటకు మరో వెయ్యి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేట దేశానికే రోల్‌మోడల్‌గా ఉందన్నారు. అలాగే త్రీటౌన్ పోలీస్ స్టేషన్, బస్తీ దవాఖానా మంజూరు చేశామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

- Advertisement -