గుండు హనుమంతరావు మృతి పట్ల సీఎం దిగ్ర్భాంతి..

186
cm kcr shocked over gundu's death
- Advertisement -

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంత రావును సోమవారం(నేడు) తుదిస్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపట్ల పలువురు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ గొప్ప హాస్యనటుడ్ని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.

కాగా..ఈ క్రమంలోనే గుండు హనుమంత రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంత రావును కాపాడడానికి వైద్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం. సినీ, టీవీ, రంగస్థలం ద్వారా తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న హనుమంత రావు మరణం తీరని లోటు అని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

- Advertisement -