ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం..

201
- Advertisement -

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనలేదని, రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని సీఎం కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. శనివారం ప్రగతి భ‌వ‌న్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై సీఎం చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కలెక్టర్లను, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం అమలు చేయలేదని సీఎం అన్నారు. వీటిని కొనసాగిస్తామని స్పష్టం చేసారు. రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. వానాకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్లను, వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రైతులను ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలన్నారు.

- Advertisement -