అదనపు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం..

124
kcr cm
- Advertisement -

అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సమావేశమయ్యారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత, వైకుంఠ ధామాల‌కు సంబంధించిన అంశాల‌పై చర్చిస్తు్నారు. జిల్లాల వారీగా పల్లె, పట్టణ ప్రగతి అమలు, పనుల పురోగ‌తి వంటి అంశాల గురించి, వాటిల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సీఎం అడిగి తెలుసుకుంటున్నారు.

ఆయా కార్య‌క్ర‌మాల‌ తదుపరి లక్ష్యాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా కార్యక్రమాల‌కు ఆర్థిక సంఘంతో పాటు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపుల వ‌ల్ల నిధులు స‌మ‌కూరుతోన్న విష‌యం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యాయి. పల్లె, పట్టణ ప్రగతి అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈ నెల 19వ తేదీ నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ఇప్పటికే కేసీఆర్‌ ప్రకటించిన విష‌యం తెలిసిందే. గ్రామాలు, మండలాల వారీగా చార్టులు రూపొందించాలని ఆదేశించారు.

- Advertisement -