గోరెటి వెంకన్నకు సీఎం కేసీఆర్ అభినందనలు..

177
- Advertisement -

ప్రముఖ కవి, శాసన మండలి సభ్యులు గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల గోరెటి వెంకన్నకు శుభాకాంక్షలు తెలిపారు. దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుంది. మానవ జీవితానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని, మనిషికి ఇతర జంతు, పక్షి జీవాలకు వున్న అనుబంధాన్ని అత్యున్నతంగా ఆవిష్కరిస్తుంది. తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరెటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారు. గోరెటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికతకు దక్కిన గౌరవం అని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.

- Advertisement -