ప్రగతిభవన్‌లో రుద్రాక్ష మొక్క నాటిన సీఎం కేసీఆర్…

283
kcr cm
- Advertisement -

ముఖ్యమంత్రి వ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతుంది. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రార్ధన మేరకు కేసిఆర్ స్వయంగా “కోటి వృక్షార్చన”లో పాల్గొని రుద్రక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ని అభినందించారు.

ఇక జలవిహార్‌లో కోటి వృక్షార్చనలో భాగంగా ఎంపీ కేశవరావుతో కలిసి మొక్కలు నాటారు ఎంపీ సంతోష్.సీఎం కేసీఆర్‌ ప్రేరణతోనే గత మూడేండ్లుగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క గంటలో కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దీనికి మంచి స్పందన వస్తుందని సంతోషం వ్యక్తంచేశారు.

- Advertisement -