సుదర్శనయాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్..

213
kcr kondapochamma
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్‌కు కాసేపట్లో శంకుస్ధాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా మర్కూర్ పంప్ హౌజ్ దగ్గర చినజీయర్ స్వామితో కలిసి సుదర్శన యాగం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్ దంపతులు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామికి ఘనస్వాగతం పలికారు సీఎం. సుదర్శన యాగం, పూర్ణాహుతి ముగిసిన అనంతరం మర్కూక్‌ పంపు హౌజ్‌ను ప్రారంభించనున్నారు సీఎం.

అంతకముందు ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ రెండు రైతు వేదికలను సీఎం కేసీఆర్‌ తన సొంత ఖర్చులతో నిర్మించనున్నారు.

- Advertisement -