మాజీ సీఎస్‌ నరేంద్ర కన్నుమూత…సీఎం కేసీఆర్ సంతాపం

144
cm kcr
- Advertisement -

ప్రముఖ రచయిత,కాలమిస్ట్,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ నరేంద్ర లూథర్‌(88) ఇక లేరు. అనారోగ్య కారణాలతో ఇవాళ కన్నుమూశారు. పంజాబ్‌లోని హోషియాపూర్‌లో మార్చి 23…1932న జన్మించారు. ఉమ్మడి ఏపీ సీఎస్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు.

లూథర్‌కు భార్య బింది, కుమారుడు రాహుల్‌, కుమార్తె సంధ్యా ఉన్నారు. హైదరాబాద్‌లోని సేవ్‌ టు రాక్స్‌ సొసైటీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. నరేంద్ర లూథర్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన సేవలను కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. లూథర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -