ములాయం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

97
- Advertisement -

యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ములాయం మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం.. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాన్ని నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే అంకితం చేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

- Advertisement -