కాకర్ల మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం…

131
kcr
- Advertisement -

ప్రముఖ డాక్టర్, నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.నిమ్స్ డైరక్టర్ గా ఆయన చేసిన కృషి గొప్పదని…..కాకర్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కాక‌ర్ల సుబ్బారావు నెల రోజుల క్రితం కిమ్స్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సుబ్బారావు మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.

సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్‌ పట్టా పొందారు. ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా….. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించారు.

- Advertisement -