జస్టిస్ కేశవరావు మృతిపట్ల సీఎం సంతాపం..

95
- Advertisement -

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ కేశవరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. పేదలకు ఆయన అందించిన న్యాయ సేవలను స్మరించుకున్నారు. జస్టిస్‌ కేశవరావు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయమూర్తి మృతి పట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్‌ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ కేశవరావు సేవలు అందించారు.

- Advertisement -