గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి సీఎం కేసీఆర్ ఘననివాళి..

41
- Advertisement -

ప్రజా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి ఘనంగా నివాళుల‌ర్పించారు సీఎం కేసీఆర్. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి చేరుకున్న సీఎం.. గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చారు.

సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, చంటి క్రాంతి కిర‌ణ్‌, మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న‌, బీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు నివాళుల‌ర్పించారు.

గద్దర్ అంతిమయాత్రలో వేలాదిగా పాల్గొన్నారు ప్రజలు. రాజకీయాలకు అతీతంగా గద్దర్‌కు నివాళి అర్పించారు.

Also Read:ఇంతకీ, త్రివిక్రమ్ ఏం చేస్తున్నట్టు?

- Advertisement -