ఫరీదుద్దీన్ సేవలు మరువలేనివి: సీఎం కేసీఆర్

133
cm kcr
- Advertisement -

టీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఫరీదుద్దీన్…హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికొత్స పొందుతూ మరణించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్‌లో మైనారిటీ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2016 సంవత్సరంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

- Advertisement -