బాపూకి నివాళులర్పించిన కేసీఆర్‌..

190
CM KCR Pays Tribute to Mahatma Gandhi
- Advertisement -

నేడు మహాత్మా గాంధీ 148వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపుఘాట్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి గవర్నర్, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసానితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు.. పాల్గొని లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ లో గాంధీజీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పలు పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -