కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీతో సీఎం కేసీఆర్ భేటీ..

138
kcr
- Advertisement -

మూడురోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో చాలారోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంకోసం ఆయన సంబంధిత శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి, విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నూతన ఎయిర్ పోర్టుల ఏర్పాటు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నిధుల అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -