26న‌ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం..

74
KCR
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించే తేదీ మారింది. ఈ నెల 28వ తేదీకి బ‌దులుగా రెండు రోజులు ముందే (జూన్ 26న‌) క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఈ స‌మావేశానికి క‌లెక్ట‌ర్లు, స్థానిక సంస్థ‌ల అద‌న‌పు క‌లెక్ట‌ర్ల‌తో పాటు డీపీవోలు, డీఆర్డీవోలు హాజ‌రు కానున్నారు. సీఎం, క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో మంత్రులు కూడా పాల్గొన‌నున్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, హ‌రిత‌హారంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -