ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్…

178
kcr
- Advertisement -

సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా దుద్దెడ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. అనంతరం పొన్నాలలో నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ఎన్సాన్‌పల్లిలో ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఈ దవాఖానను 960 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. అనంతరం 12.30 గంటలకు సిద్దిపేటలోని కోమటి చెరువు, నెక్లెస్‌ రోడ్డును పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు నర్సాపూర్‌లో డబల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఈ రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని రూ.163 కోట్లతో నిర్మించారు. ఈ ప్రాంతానికి కేసీఆర్‌ నగర్‌ అని నామకరణం చేశారు. తొలి విడతలో 1,341 ఇళ్లు, రెండో విడుతలో వెయ్యి ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

మధ్యాహ్నం 1.20 గంటలకు చింతల్‌ చెరువు వద్ద తొలివిడత భూగర్భ మురుగుపారుదల వ్యవస్థను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.40 గంటలకు రంగనాయకసాగర్‌ అతిథిగృహాన్ని ప్రారంభించను న్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు.

- Advertisement -