KCR:డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభం

30
- Advertisement -

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేయగా అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Also Read:ఇటలీలో ప్రభాస్.. దాని కోసమే !

60 వేల మంది ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో నిర్మించారు.

- Advertisement -