ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీల‌క స‌మావేశం..

60
cm kcr
- Advertisement -

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌టంతో అన్ని పార్టీలు ముమ్మ‌ర స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ మంత్రుల‌తో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్.

సాయంత్రం ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులతోపాటు ఫ్లోర్‌ లీడర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌తో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చర్చించనున్నారు.

కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్‌పై యుద్దం ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకోనున్నారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. నాన్ బీజేపీ పార్టీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తిస్తారా లేక ప‌లు ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తారా అన్న స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుందోన‌న్న ఉత్కంఠ రాజ‌కీయ వ‌ర్గాల్లో కొన‌సాగుతోంది.

- Advertisement -