వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ కీలక భేటీ

70
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి రెండు వారాల పాటు ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ వేడుకలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కమిటీని కూడా నియమించింది.

ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసింది. ఈ కమిటీతో ఇవాళ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. కమిటీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కార్యాచరణను ఖరారు చేస్తారు.

- Advertisement -