నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

436
cm kcr
- Advertisement -

నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్-జగన్‌లు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ భేటీలో నదీజలాలు, విద్యుత్ ఉద్యోగులు … ఇతర విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర వాటిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన ఇరు రాష్ట్రాల సీఎంలు పలు అంశాలపై ఓ అవగాహనకు వచ్చారు. ఖాళీగా ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరగా వెంటనే సెక్రటేరియట్ భవనాలను తెలంగాణకు అప్పగించారు ఏపీ సీఎం జగన్. తాజాగా మరోసారి ఇద్దరు సీఎంలు సమావేశం అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -