ఉద్యోగులకు, పెన్షనర్లకు పూర్తి జీతాలు- సీఎం కేసీఆర్

247
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం కొంచెం మెరుగవుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల పూర్తి వేతనాలు చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కరోనా సంక్షోభం వల్ల గల మూడు నెలల నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే జీతాలు, పింఛన్లలో ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌లు ముగిసి అన్‌లాక్‌లు కొనసాగుతుండటం, ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు కొనసాగుతుండటం వల్ల రాష్ట్ర ఆదాయ పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగు అవుతుందన్నారు సీఎం కేసీఆర్‌.

- Advertisement -