సాయిచంద్ సంస్మరణ సభకు సీఎం కేసీఆర్

38
- Advertisement -

గాయకుడు సాయిచంద్ సంస్మరణ సభ ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు సాయిచంద్ దశదిన కర్మకు హాజరుకానున్నారు సీఎం కేసీఆర్. సాగర్‌ రోడ్డులోని జీఎ్‌సఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది.

తర్వాత మహంకాళి బోనాల కోసం మధ్యాహ్నం సతీ సమేతంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.తరవాత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటికి వెళ్లనున్నా సీఎం అక్కడే భోజనం చేయనున్నారు. అమ్మవారి దర్శనం తరవాత తిరిగి ప్రగతి భవన్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి సతీమణి.

Also Read:ఆ నటి వ్యాపారంపై పుకార్లు!

ఇక సాయిచంద్ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్…చెప్పిన విధంగా ఆ కుటంబానికి రూ. కోటిన్నర ఆర్ధిక సాయంతో పాటు ఆయన భార్యను గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.

Also Read:Harishrao:మా తండాలో మా రాజ్యం

- Advertisement -